నీళ్ళు, విద్యుత్ విషయంలో కాంగ్రెస్ విఫలం: జగదీశ్ రెడ్డి

62చూసినవారు
నీళ్ళు, విద్యుత్ విషయంలో కాంగ్రెస్ విఫలం: జగదీశ్ రెడ్డి
విద్యుత్ కొనుగోళ్ళు , కాళేశ్వరం ప్రోజెక్టుల విచారణపై మాజీమంత్రి జగదీష్ రెడ్డి స్పందించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసి 6 నెలలైనా హామీల అమలు మరచి గత ప్రభుత్వాల పై కాంగ్రెస్ ప్రభుత్వం నిందలు వేస్తోందని ఎద్దేవా చేశారు. హామీల అమలుపై ప్రజలు నిలదీస్తారని కమీషన్ల విచారణ పేరుతో మీడియాకు లీకుల డ్రామాలు చేస్తుందని మండిపడ్డారు. 4 నెలలుగా సమయం వృధా చేసి ఇప్పుడు హడావిడి చేస్తున్నారన్నారు. నీళ్ళు , విద్యుత్ విషయంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందన్నారు.

సంబంధిత పోస్ట్