రామ, శివ భక్తుల మధ్య చిచ్చు పెట్టేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారని ప్రధాని మోదీ ఆరోపించారు. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ద్వేషపూరిత ఉద్దేశంతోనే శివుడు, రాముడిపై ప్రకటన చేశారని మండిపడ్డారు. మన ఆచార వ్యవహారాలు వేలాది సంవత్సరాల నుంచి వేళ్లూనుకున్నాయని, మన ఆచార వ్యవహారాలను చివరికి మొఘలులు కూడా విచ్ఛిన్నం చేయలేకపోయారన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ వాటిని విచ్ఛిన్నం చేయాలని చూస్తోందని చెప్పారు.