ప్రధాని మోడీతో పరమాత్ముడు నేరుగా మాట్లాడతారని రాహుల్ గాంధీ అన్నారు. ఎన్నికల సమయంలో ప్రధాని ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలను ఆయన ఉటంకించారు. లోక్సభలో ఆయన సోమవారం ప్రసంగిస్తూ హిందువులంటే ప్రధాని మోడీ, RSS, BJP వారు మాత్రమే కాదన్నారు. మణిపూర్ను ఇప్పటి వరకు ప్రధాని మోడీ ఎందుకు సందర్శించలేదని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేతలను ఈడీ, సీబీఐ కేసులతో కేంద్రం వేధిస్తోందని విమర్శించారు.