కర్ణాటక రాష్ట్రం హసన్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఈ మేరకు జిల్లా ఎస్పీ కార్యాలయం ముందు ఓ కానిస్టేబుల్ తన భార్యను దారుణంగా చంపాడు. హసన్ నగర్ పిఎస్ లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న లోక్నాథ్ అనే వ్యక్తికి అతని భార్య మమతకు గత కొన్నాళ్లుగా ఓ భూమి విషయంలో గొడవ జరుగుతోంది. ఈ క్రమంలో తనను లోక్నాథ్ హింసిస్తున్నాడని జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు మమత సోమవారం ఎస్పీ కార్యాలయానికి వెళ్ళగా అక్కడే కత్తితో దారుణంగా పొడిచి చంపాడు.