కర్ణాటకకు చెందిన బీజేపీ ఎంపీ అనంతకుమార్ హెగ్డే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్తో పాటు రాష్ట్రాల్లో బీజేపీకి మెజారిటీ ఉంటే, హిందువులకు అనుకూలంగా రాజ్యాంగాన్ని మార్చుకోవచ్చని అన్నారు. ‘ప్రధాని మోదీకి లోక్సభలో మెజారిటీ ఓట్లతో ఇది జరగదు. లోక్సభ, రాజ్యసభతోపాటు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలలో మూడింట రెండొంతుల మెజారిటీ మాకు (బీజేపీకి) అవసరం’ అని పేర్కొన్నారు.