రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. నలుగురు రైతులకు కరెంట్ షాక్ తగలగా, వారిలో ఒకరు మృతి చెందారు. కోనరావుపేట మండలం బావుసాయిపేట గ్రామానికి చెందిన ఉష్కల రోశయ్య అనే రైతు పొలంలో బోరు మోటారు దించేందుకు నలుగురు రైతులు వెళ్లారు. మోటారు దించుతుండగా వారికి కరెంట్ షాక్ తగిలి అపస్మారకస్థితిలోకి వెళ్లారు. వారిని వేములవాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పంబల భూమయ్య మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.