తిరుమల కొండపై భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్సులోని అన్ని కంపార్ట్మెంట్లు నిండి బయట క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారు. బుధవారం 81,930 మంది స్వామివారిని దర్శించుకోగా.. 41,224 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.90 కోట్లు వచ్చింది.