తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. దీంతో హైదరాబాద్ సహా పలు జిల్లాలో వర్షం కురిస్తోంది. దీంతో నిన్నటి వరకు భానుడి భగభగలతో ఉక్కిరిబిక్కిరైన ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది. మరో మూడ్రోజుల పాటు వెదర్ చల్లగానే ఉంటుందని, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ పేర్కొంది.