నేల చూపులు చూస్తున్న పత్తి ధర

74చూసినవారు
నేల చూపులు చూస్తున్న పత్తి ధర
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలోని మార్కెట్‌లో పత్తి ధరలు నేల చూపులు చూస్తున్నాయి. ఏపీలోని ఆదోని మార్కెట్‌లో 15 రోజుల కిందట పత్తి ధరలు క్వింటా రూ.8,200 వరకు పలికింది. అయితే కొన్ని రోజులకే రూ.500-700 ధరలు తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం క్వింటా గరిష్ఠ ధర రూ.7,677 వరకు పలుకుతోంది. తెలంగాణలోని ఖమ్మం మార్కెట్‌లో క్వింటాల్ పత్తి గరిష్ట ధర రూ.7,111 పలికింది. ఆదిలాబాద్, భైంసా మార్కెట్లలో క్వింటాల్ పత్తి ధర రూ.7521గా ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్