హోలీ పండుగ వేళ ఉత్తరప్రదేశ్లోని సున్నిత ప్రాంతాల్లో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అలీగఢ్, బరేలీ, షాజహాన్పూర్లలోని సమస్యాత్మక ఏరియాల్లో ఉన్న మసీదులను పెద్దపెద్ద టార్పాలిన్ కవర్లతో కప్పేశారు. ఆయా చోట్ల పోలీస్ పికెట్లు ఏర్పాటు చేశారు. హోలీ పండుగ రోజే బరేలీ నగరంలో ‘రామ్ బారాత్’ యాత్ర నిర్వహిస్తుండటంతో మసీదులపై రంగులు పడకుండా ఉండేందుకు పోలీసులు ఈ ఏర్పాట్లు చేశారు.