దుర్గామాత ఆలయంలో ఆవు కాళ్లు ఉంచడం కలకలం రేపింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం ఉత్తర దినాజ్పూర్లోని నారాయణపూర్లో ఈ ఘటన జరిగింది. మైనారిటీలు ఎక్కువగా ఉండే ప్రాంతంలోని దుర్గామాత ఆలయంలో ఆవు మాంసం కాళ్లు కనిపించాయి. దీంతో హిందువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దుండగులను గుర్తించిన తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.