మహిళలకు టీడీపీ అధినేత చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. శ్రీకాకుళంలో మహిళలతో ముఖాముఖి నిర్వహించిన ఆయన మహిళలకు టీడీపీ పుట్టినిల్లని వ్యాఖ్యనించారు. అమ్మకు వందనం కింద ప్రతి బిడ్డకు రూ.15వేలు ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఆడబిడ్డలను లక్షాధికారులను చేయడమే తన లక్ష్యమన్నారు. స్థలం లేని వాళ్లకి రెండు లేదా మూడు సెంట్లలో ఇళ్లు కట్టిస్తామని చెప్పారు. ప్రతి కుటుంబానికి తాను పెద్దకొడుకులా సేవ చేస్తానని చెప్పారు.