తిరుమలలో భక్తుల రద్దీ.. 3 కి.మీ మేర బారులు

69చూసినవారు
తిరుమలలో భక్తుల రద్దీ.. 3 కి.మీ మేర బారులు
తిరుమలలో శ్రీవారి దర్శనానికి రద్దీ కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక నుంచి వచ్చే భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌, నారాయణగిరి షెడ్లు నిండిపోయాయి. రింగు రోడ్డు మీదుగా ఆక్టోపస్ భవనం వరకు సుమారు 3 కిలోమీటర్ల వరకు బారులు తీరారు. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతోందని టీటీడీ వెల్లడించింది. క్యూలైన్లలో ఉన్న భక్తులకు అధికారులు తాగునీరు, అన్నప్రసాదాలు, పాలు అందిస్తున్నారు.

సంబంధిత పోస్ట్