ఆఫ్ఘనిస్థాన్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. పశ్చిమ ప్రావిన్స్లోని ఘోర్లో ఇటీవల వరదల్లో 50 మంది మరియు ఉత్తర ప్రావిన్స్ ఫర్యాబ్లో 18 మంది మరణించారని తాలిబాన్ అధికారులు పేర్కొన్నారు. భారీగా ఆస్తినష్టం జరిగినట్లు చెబుతున్నారు. భారీ వర్షాల కారణంగా గడిచిన వారం రోజుల్లో 300 మందికి పైగా మరణించారని ఐక్యరాజ్యసమితి తెలిపింది. ప్రజలు అనేక ప్రాంతాలకు ట్రక్కుల ద్వారా ఆహారాన్ని రవాణా చేయలేకపోతున్నారు.