తండ్రి ఆస్తిలో కుమార్తె పిల్లలకూ హక్కు: హైకోర్టు

2250చూసినవారు
తండ్రి ఆస్తిలో కుమార్తె పిల్లలకూ హక్కు: హైకోర్టు
కుమార్తెలు మరణించినా ఆమె తండ్రి ఆస్తిలో వారి పిల్లలకు హక్కు ఉంటుందని కర్ణాటక హైకోర్టు తీర్పునిచ్చింది. తమ తోబుట్టువులు చనిపోయారని, వారికి గానీ, వారి సంబంధీకులకు గానీ ఆస్తిలో వాటా ఎందుకు ఇవ్వాలంటూ కర్ణాటకలోని నరగుందకు చెందిన చెన్నబసప్ప హొసమఠ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తి జస్టిస్‌ సచిన్‌ శంకర్‌ మగదం తోసిపుచ్చారు. పిత్రార్జిత ఆస్తిలో కుమార్తెలకూ హక్కు ఉంటుందని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్