తండ్రికి అంత్యక్రియలు చేసిన కుమార్తెలు

566చూసినవారు
తండ్రికి అంత్యక్రియలు చేసిన కుమార్తెలు
మధ్యప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. బుందేల్‌ఖండ్‌ పరిధిలోని సాగర్‌లో రిటైర్డ్ పోలీసు హరిశ్చంద్ర అహిర్వార్ ఉంటున్నారు. అతనికి తొమ్మిది మంది కుమార్తెలు. కొడుకులు లేరు. అయితే హరిశ్చంద్ర అహిర్వార్ అనారోగ్యం వల్ల కన్నుమూశాడు. ఈ నేపథ్యంలో అతని కుమార్తెలు తమ తండ్రికి తామే అంత్యక్రియలు చేయాలని నిర్ణయించుకుని అంత్యక్రియలు చేశారు. ఈ ఘటన స్థానికంగా చర్చాంశనీయంగా మారింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్