కేరళ చేరుకున్న 45 మంది భారతీయుల మృతదేహాలు

58చూసినవారు
కువైట్‌లోని అల్‌ మంగాఫ్‌లో బుధవారం జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 49 మంది కార్మికులు మరణించిన సంగతి తెలిసిందే. వారిలో 45 మందిని భారతీయులుగా గుర్తించారు. ఇప్పుడు ఆ మృతదేహాలను తీసుకుని ప్రత్యేక IAF విమానం కువైట్ నుంచి కేరళలోని కొచ్చిన్ విమానాశ్రయానికి చేరుకుంది. ఇప్పటికే రాజకీయ ప్రతినిధులు, బాధిత కుటుంబాలకు చెందిన పలువురు విమానాశ్రయానికి చేరుకున్నారు.

సంబంధిత పోస్ట్