లండన్ NRI బీఆర్ఎస్ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి హాజరైయ్యారు. లండన్ నగరంలోని టావిస్టాక్ స్క్వేర్ వద్ద తెలంగాణ అమరుల త్యాగాలను స్మరించుకుంటూ జగదీష్ రెడ్డి, లండన్ బీఆర్ఎస్ శాఖ సభ్యులు కొవ్వొత్తుల ర్యాలీ చేశారు.