పార్టీ నేతలకు సీఎం కేజ్రీవాల్ సందేశం

58చూసినవారు
పార్టీ నేతలకు సీఎం కేజ్రీవాల్ సందేశం
బెయిల్ గడువు ముగియనుండడంతో ఇవాళ సీఎం కేజ్రీవాల్ తిహార్ జైలులో లొంగిపోనున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ నేతలకు సందేశం ఇచ్చారు. ‘నేను ఈరోజు లొంగిపోతాను. మధ్యాహ్నం 3 గంటలకు ఇంటి నుంచి బయలుదేరి రాజ్‌ఘాట్‌లోని మహాత్మాగాంధీ సమాధివద్ద నివాళులర్పిస్తాను. అక్కడ నుంచి హనుమాన్ ఆలయానికి వెళతాను. పార్టీ ఆఫీస్‌కి వెళ్లి నేతలు, కార్యకర్తలను కలిసి తిహార్‌కు వెళ్తాను’ అని ట్వీట్ చేశారు.

సంబంధిత పోస్ట్