తమిళ స్టార్ హీరో శింబు కథానాయకుడిగా అగ్ర నటుడు కమల్హాసన్ భారీ పీరియాడిక్ చిత్రం నిర్మించబోతున్నాడు. ఈ చిత్రంలో శింబు సరసన నాయికగా బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె నటించనున్నట్లు సమాచారం. దేశింగు పెరియస్వామి దర్శకుడు. ఈ చిత్రంలో శింబు హీరో, విలన్గా ద్విపాత్రాభినయం చేయబోతున్నారని తెలుస్తోంది. కథ నచ్చడంతో దీపికా ఈ ప్రాజెక్టుని ఒకే చేసిందట. దీపికా మళ్ళీ తమిళ ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇవ్వడం పై ప్రాధాన్యత సంతరించుకుంది.