అగ్నిగుండంలా ఢిల్లీ

69చూసినవారు
అగ్నిగుండంలా ఢిల్లీ
ఉత్తర భారత దేశంతోపాటు ఈశాన్యం అగ్ని గుండాలుగా మారాయి. ఢిల్లీ, పంజాబ్, హరియాణా, చండీగఢ్, ఉత్తర్‌ ప్రదేశ్, ఉత్తర రాజస్థాన్‌ వేడితో ఉడికిపోతున్నాయి. ఈ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 43 నుంచి 45 డిగ్రీల సెల్సియస్‌ మధ్య నమోదవుతున్నాయి. ఢిల్లీలో తీవ్ర ఉక్కపోతతోపాటు నీటి కొరత ప్రజలను అల్లాడిస్తోంది. వడ దెబ్బ బాధితులతో ఆసుపత్రులు కిక్కిరిసిపోతున్నాయి. ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆర్‌ఎంఎల్‌ ఆసుపత్రిలో గత రెండు రోజుల్లో 22 మంది వడ దెబ్బ బాధితులు చేరారు. వారిలో ఐదుగురు చనిపోయారు. 13 మంది వెంటిలేటర్‌పై ఉన్నారు.

సంబంధిత పోస్ట్