అమిత్ షాపై ఫేక్ వీడియో కేసులో ఢిల్లీ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. హైదరాబాద్ లోని గాంధీ భవన్ కు ఢిల్లీ పోలీసులు చేరుకున్నారు. అమిత్ షా ఫేక్ వీడి
యోపై సీఆర్పీసీ 91 కింద తెలంగాణ
కాంగ్రెస్ సోషల్ మీడియా ఇంఛార్జ్ మన్నె సతీష్ కు నోటీసులు జారీ చేశారు. తెలంగాణ
కాంగ్రెస్ ట్విట్టర్ ను మన్నె సతీష్ నిర్వహిస్తున్నారు. ఎవరు ఫిర్యాదు చేశారని
కాంగ్రెస్ నేతలు ప్రశ్నించగా.. వివరాలు అడిగి చెప్తామని ఢిల్లీ పోలీసులు సమాధానం ఇచ్చారు.