దిల్లీ కాలుష్య బోర్డు సీనియర్ ఇంజినీర్ ను అరెస్టు చేసిన సీబీఐ.. రూ.2.39 కోట్ల నగదు స్వాధీనం

72చూసినవారు
దిల్లీ కాలుష్య బోర్డు సీనియర్ ఇంజినీర్ ను అరెస్టు చేసిన సీబీఐ.. రూ.2.39 కోట్ల నగదు స్వాధీనం
అవినీతి కేసులో దిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ సీనియర్ ఇంజనీర్ మహ్మద్ ఆరిఫ్ ను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అరెస్టు చేసింది. ఈయన రూ.91,000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. ఈ నేపథ్యంలో ఆరిఫ్ కు సంబంధించిన ఇంటి స్థలంలో తనిఖీలు చేసి రూ.2.39 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నట్లు సీబీఐ తెలిపింది. ఆరిఫ్ తరఫున కంపెనీల నుంచి లంచం సొమ్మును తీసుకునే మధ్యవర్తి కుమారుడు కిష్ణయా శరణ్ సింగ్ ను కూడా అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్