తమిళనాడులోని వాణియంబాడి సమీపంలో ఆదివారం గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఈ గూడ్స్ రైలు చెన్నై పోర్టు నుంచి బెంగళూరు వైట్ఫీల్డ్కు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. వెంటనే లోకోపైలట్ ట్రైన్ ఆపి, రైల్వే అధికారులకు సమాచారం అందించాడు. ఇక ఈ ఘటనతో బెంగళూరు-కోయంబత్తూరు మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. కొన్ని ప్రాంతాల్లో రైళ్లు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు.