కశ్మీర్‌లో ఇండియా కూటమిలో విబేధాలు

68చూసినవారు
కశ్మీర్‌లో ఇండియా కూటమిలో విబేధాలు
జమ్మూకశ్మీర్‌లో ఇండియా కూటమిలోని నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా, పీడీపీ నాయకురాలు మోహబూబా ముఫ్తీల మధ్య స్వల్ప విబేధాలు ఏర్పడ్డాయి. ఒమర్ అబ్దుల్లా మీడియాతో మాట్లాడుతూ.. కావాలనుకుంటే జమ్మూ సీట్లను కాంగ్రెస్ పీడీపీకి ఆఫర్ చేయొచ్చని, గతంలో గెలిచిన సీట్లను మాత్రం తాము త్యాగం చేయలేమని తెలిపారు. కాంగ్రెస్‌తో సీట్ల సర్దుబాటుపై చర్చలు కొనసాగుతున్నాయని, దీనిపై త్వరలోనే ప్రకటన చేస్తామని వెల్లడించారు.

సంబంధిత పోస్ట్