అమృత్ పాల్ సింగ్, ఇంజినీర్ రషీద్ జైల్లో ఉంటూ ఎలా ఎంపీలుగా పోటీ చేశారని, ప్రమాణస్వీకారం సంగతేంటని చర్చ జరుగుతుంది. గతంలో జైల్లో ఉన్న సంజయ్ సింగ్, అఖిల్ గొగోయ్కు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసి ప్రమాణ స్వీకారం చేయించారు. కావున వీరిని కూడా ఒక్క రోజు పెరోల్ పై విడుదల చేసి ప్రమాణ స్వీకారం చేయించే అవకాశం ఉంది.