20 ఏళ్ల తర్వాత తొలిసారిగా సున్నా

56చూసినవారు
20 ఏళ్ల తర్వాత తొలిసారిగా సున్నా
2001లో TRS(BRS) పార్టీ ఆవిర్భావం తర్వాత 2004లో తొలిసారిగా పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీ పోటీ చేసింది. ఆ ఎన్నికల్లో గులాబీ పార్టీ 5 సీట్లు కైవసం చేసుకుంది. 2008 ఉప ఎన్నికల్లో 2 సీట్లు, 2009 సార్వత్రిక ఎన్నికల్లో 2 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. 2014లో జరిగిన ఎన్నికల్లో 11 స్థానాలు, 2019 ఎన్నికల్లో 9 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు గెలిచారు. కాని 20 ఏళ్ల తర్వాత తొలిసారిగా సున్నాకు పరిమితమైంది.

సంబంధిత పోస్ట్