ఏపీలో 40 మంది సలహాదారుల తొలగింపు

60చూసినవారు
ఏపీలో 40 మంది సలహాదారుల తొలగింపు
ఏపీ రాష్ట్రంలోని 40 మంది సలహాదారులను తొలగిస్తూ సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులను జారీ చేసింది. ఎన్నికల ఫలితాలు వచ్చిన ఈ నెల 4వ తేదీ నుంచి తొలగింపు ఉత్తర్వులు అమలులో ఉంటాయని జీఏడీ అధికారులు వెల్లడించారు. సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు 20 మంది సలహాదారులు తమ పదవులకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. చేయని వారిని తాజాగా ప్రభుత్వం తొలగించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్