నిర్మల్ జిల్లా బుధవార్పేట్ కాలనీలో నీళ్ల కోసం ఒకే బావిలో 12 మోటార్లు పెట్టారు. నీటి కరువు, కాలనీ గుట్ట మీద ప్రాంతం కావడంతో ఎన్ని బోర్లు వేసినా నీరు పడడం లేదు. దీంతో కాలనీలో ఉన్న ఓ బావిలో దాదాపు 12 మోటార్లు పెట్టి నీటిని తోడుకుంటున్నారు. ఆ బావిలో కూడా నీళ్లు అడుగంటిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.