ప్రజాభవన్‌లో సింగరేణి కార్మికులకు బోనస్‌ చెక్కుల పంపిణీ

68చూసినవారు
ప్రజాభవన్‌లో సింగరేణి కార్మికులకు బోనస్‌ చెక్కుల పంపిణీ
సింగరేణి కార్మికులకు బోనస్‌ చెక్కుల పంపిణీ కార్యక్రమం హైాదరాబాద్ ప్రజాభవన్‌లో జరిగింది. కార్మికులకు రూ.796 కోట్ల బోనస్‌ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి, శ్రీధర్‌బాబు హాజరయ్యారు. 2023-24 సంవత్సరానికి సింగరేణికి రూ.2,412 కోట్ల లాభం వచ్చింది. లాభాల్లో 33 శాతాన్ని కార్మికులకు బోనస్‌గా ప్రభుత్వం ప్రకటించింది. ఒక్కో కార్మికుడికి సగటున రూ.1.9 లక్షలు రానుంది.

సంబంధిత పోస్ట్