దేశాభివృద్ధికి కొత్త లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకు సాగుతామని రాజ్యసభలో ప్రధాని మోదీ అన్నారు. రైతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని, పంటల కనీస మద్దతు ధరలను భారీగా పెంచామన్నారు. అన్నదాతల ప్రయోజనాల కోసం అనేక పథకాలు తీసుకొచ్చామని, పీఎం కిసాన్ ద్వారా ఆరేళ్లలో రూ.3 లక్షల కోట్లు పంపిణీ చేశామని వివరించారు. సన్నకారు రైతుల కోసం గతంలో కాంగ్రెస్ ఎలాంటి పథకాలు తీసుకురాలేదని ప్రధాని విమర్శించారు.