తెలంగాణ బీజేపీ అధ్యక్షురాలిగా మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణను నియమించవచ్చని తాజాగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఆమె బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు. తాజా ఎన్నికల్లో డీకే అరుణ మహబూబ్ నగర్ నుంచి బీజేపీ ఎంపీగా పోటీ చేసి తక్కువ మెజారిటీతో విజయం సాధించారు. తనకే బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పీఠం ఇవ్వాలని డీకే అరుణ పార్టీ పెద్దలను కోరుతున్నట్టు సమాచారం. బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డి కేంద్ర కేబినెట్ మంత్రి అయ్యారు.