బస్ ఛార్జీలు పెంచం: ఏపీ మంత్రి

79చూసినవారు
బస్ ఛార్జీలు పెంచం: ఏపీ మంత్రి
ఛార్జీల భారం పెంచకుండానే.. బస్సు సర్వీసులు పెంచి మంచి సేవలందిస్తామని ఏపీ మంత్రి రామ్‌ప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు. వైసీపీ హయాంలో రవాణా శాఖ నిర్వీర్యమైందని విమర్శించారు. కుప్పంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వంలో ఆర్టీసీలో కనీస భద్రతా ప్రమాణాలు పాటించలేదన్నారు. లీజుల పేరుతో ఆర్టీసీ భూములను వైసీపీ నేతలు చెరబట్టారని ఆరోపించారు. లీజుకు తీసుకున్న భూములను వెనక్కి తీసుకుంటామని చెప్పారు.

సంబంధిత పోస్ట్