మిజోరం రాజధాని ఐజ్వాల్కి మీరెప్పుడైన వెళ్తే అక్కడ రోడ్లన్ని ప్రశాంతంగా ఉంటాయి. వాహనాలు రోడ్లపై వెళ్లాక అనుకునేరు.. వాహనదారుల క్రమశిక్షణే రోడ్లను ప్రశాంతంగా ఉంచుతాయి. ఇక్కడ వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పకుండా పాటిస్తారు. రోడ్లపై ఇష్టానుసారంగా వాహనాలు నడపరు. దీంతో ఇక్కడ అరుదుగా ట్రాఫిక్ సమస్య తలెత్తుతుంది. కార్లని ఒక వరుసలో, బైక్లన్నీ మరో వరుసలో, పెద్ద వాహనాలన్నీ ఇంకో వరుసలో ప్రయాణిస్తుంటాయి.