కొంతమంది టీ తాగేటప్పుడు బిస్కెట్ కూడా తింటూ ఉంటారు. అయితే టీతోపాటు బిస్కెట్ తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. టీతో పాటు బిస్కెట్ తీసుకుంటే.. బీపీ పెరిగే అవకాశం ఉంది. ఇంకా గుండె సమస్యలు వస్తాయి. డయాబెటిస్ ముప్పును పెంచుతుంది. మలబద్ధక సమస్యకు దారితీస్తుంది. అయితే టీ తాగేటప్పుడు బిస్కెట్కు బదులుగా వేయించిన శనగలు తినొచ్చని సూచిస్తున్నారు.