శుభకార్యాలకు వెళుతుంటే పిల్లి అడ్డం వస్తే కొందరు ఆ కార్యానికి వెళ్ళడం అశుభంగా భావిస్తారు. అసలు ఈ సాంప్రదాయం ఎలా వచ్చిందంటే.. పూర్వం ప్రయాణాలు అడవుల గుండా ఎడ్ల బండి మీద చేసేవారు. ఈ క్రమంలో ఈ పిల్లుల జాతికి చెందిన సింహాలు, పులుల వంటివి ఎదురు పడేవి. వాటిని చూసిన ఎడ్లు భయపడి ఆగిపోయేవి. అందుకే ఈ జాతికి చెందిన జంతువులు ఎదురుపడటం అపశకునంగా భావించేవారు. క్రమేణా ఈ వారసత్వం పిల్లులకు కూడా వర్తించడంతో ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు.