లోక్సభ ఎన్నికల్లో ప్రచారం కోసం ఎక్సైజ్ కేసుల్లో మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలన్న ఢిల్లీ డిప్యూటీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత మనీశ్ సిసోడియాకు శనివారం కోర్టులో ఊరట లభించలేదు. ఆయన పిటిషన్పై తీర్పును కోర్టు ఈ నెల 30కి వాయిదా వేసింది. గుజరాత్లో పార్టీ లోక్సభ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేపట్టే స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో సిసోడియా కూడా ఉన్నారు. ఇదే జాబితాలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, సత్యేందర్ జైన్ కూడా ఉన్నారు.