తిరుమలలో స్వామి వారి గర్భగుడి తలుపులు తెరిచేది ఎవరో తెలుసా?

1060చూసినవారు
తిరుమలలో స్వామి వారి గర్భగుడి తలుపులు తెరిచేది ఎవరో తెలుసా?
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి. ఏ ఆలయం తలుపులైనా అర్చకులే తీస్తారు. కానీ తిరుమలలో స్వామి వారి గర్భగుడి తలుపులు తెరిచేది మాత్రం యాదవులు. దీని వెనుక పెద్ద కారణమే ఉంది. శేషాచల అడవుల్లో ఓ పుట్టలో తపోనిష్టుడైన శ్రీనివాసుడిని మొదటగా యాదవ వంశీయులు దర్శిస్తారు. దాంతో యాదవ వంశీయులకే తన తొలి దర్శనం లభిస్తుందని శ్రీనివాసుడు వరమిస్తాడు. దాంతో అప్పటి నుంచి యాదవ వంశీయులే గర్భగుడి తలుపులు తెరుస్తారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్