తులసి మాల ఎందుకు ధరిస్తారో తెలుసా?

56చూసినవారు
తులసి మాల ఎందుకు ధరిస్తారో తెలుసా?
తులసి లేనిదే విష్ణుమూర్తి భోగం అసంపూర్ణంగా భావిస్తారు. విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైనది తులసి. ఈ మాల ధరించడం వల్ల ఆధ్యాత్మిక వృద్ధి, భక్తి, ప్రతికూల శక్తుల నుంచి రక్షణ లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. ఈ మాలను భక్తులు తమ మెడలో లేదా మణికట్టుకు రక్షణ సూత్రంగా కూడా ధరిస్తారు. ఇది మనస్సు, శరీరం, ఆత్మను శుద్ది చేస్తుందని నమ్ముతారు. తులసి మాలను ఎక్కువగా శ్రీకృష్ణుడి భక్తులు, వైష్ణవులు ధరిస్తారు. ఈ మాల ధరించిన వాళ్ళు దేవుడికి అత్యంత ఇష్టమైన వారిగా ఉంటారని విశ్వసిస్తారు.

సంబంధిత పోస్ట్