ఉత్తరప్రదేశ్లోని బండా జిల్లాలో దారుణం జరిగింది. ఓ ఆసుపత్రికి సీరియస్గా ఉన్న పేషెంట్తో కుటుంబ సభ్యులు వచ్చారు. వారిలో ఒక వ్యక్తి చికిత్స ఆలస్యం చేయకుండా వెంటనే చేయాలనీ వైద్యులను కోరారు. దీంతో ఆగ్రహించిన వైద్యులు, సిబ్బంది కలిసి అతడిని తీవ్రంగా కొట్టారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో వైరల్ కావడంతో సీఎంఓ విచారణకు ఆదేశించింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది.