ప్రస్తుతం సీఎం జగన్ లండన్ పర్యటనపై సోషల్ మీడియాలో నెటిజన్ల మధ్య పెద్ద చర్చ నడుస్తోంది. వాస్తవానికి ఇది వ్యక్తిగత పర్యటన అని చెబుతున్నారు. అటువంటప్పుడు ప్రభుత్వ నిధుల నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకూడదు. కానీ ఆయన రక్షణ కోసం కోట్ల రూపాయలను ఖర్చుపెట్టాల్సి వస్తోంది. విస్టా జెట్ కంపెనీకి చెందిన బొంబార్డియర్ 7500 అనే అత్యంత విలాసవంతమైన విమానంలో జగన్ లండన్ వెళ్లారు. దాని ఖర్చు గంటకు రూ.12 లక్షలు. అంటే గంటకు రూ.12 లక్షలు ఖర్చుపెట్టే వ్యక్తి పేదవాడా? పెత్తందారా? అంటూ తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు ప్రశ్నిస్తున్నారు.