దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లో మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ సూచీలు లాభాల్లో ట్రేడవుతున్నాయి. మార్కెట్ ప్రారంభంలోనే నిఫ్టీ 23,100 వద్ద ట్రేడింగ్ మొదలుపెట్టగా.. సెన్సెక్స్ 200 పాయింట్ల లాభంతో ప్రారంభమైంది. ఉదయం 9.30 గంటల సమయంలో సెన్సెక్స్ 149 పాయింట్ల లాభంతో 76,201 వద్ద, నిఫ్టీ 40 పాయింట్లు పెరిగి 23,030 వద్ద ఉన్నాయి.