తెలంగాణ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ ఇవ్వొద్దని ఈడీ తరఫు లాయర్ కోర్టును కోరారు. బెయిల్ ఇస్తే సాక్షాలను ప్రభావితం చేస్తారని వాదించారు. లిక్కర్ కేసును ప్లాన్ చేసింది కవితేనని, అప్రూవర్గా మారిన వ్యక్తిని బెదిరించారని తెలిపారు. తాము అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేదని, ఫోన్లలో డేటా డిలీట్ చేసి ఇచ్చారని పేర్కొన్నారు. కాగా మహిళగా, చట్టసభ సభ్యురాలిగా కవితకు బెయిల్ ఇవ్వొచ్చని ఆమె న్యాయవాది వాదించారు.