కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక 1000 మందికిపైగా రైతు ఆత్మహత్యలు: BJP

68చూసినవారు
కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక 1000 మందికిపైగా రైతు ఆత్మహత్యలు: BJP
రైతు హామీల సాధన కోసం బీజేపీ ప్రజా ప్రతినిధులు ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద 24 గంటల దీక్ష చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు దీక్షలో కూర్చున్నారు. బీజేపీ శాసనసభా పక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘ఇచ్చిన హామీలు మరిచారా? మరిచిపోయినట్లు నటిస్తున్నారా’.. అంటూ సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలో వచ్చాక వేయి మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్