నీటిలో చిటికెడు ఉప్పు కలుపుకుని తాగితే ఆరోగ్యానికి మంచిదని, ముఖ్యంగా డీహైడ్రేషన్కి గురయ్యే ప్రమాదం తగ్గుతుందని వైద్యులు చెబుతున్నారు. వేసవిలో విపరీతంగా చెమట పడుతుంది. దీంతో చెమట రూపంలో సోడియం మాత్రమే కాకుండా ముఖ్యమైన ఎలక్ట్రోలైట్లను కూడా కోల్పోతాము. అందుకే నీటిలో ఉప్పును కలిపి తాగితే తిరిగి శరీరానికి సోడియం అందుతుంది. తద్వారా డీహైడ్రేషన్ నుంచి కూడా తప్పించుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.