హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం రేపింది. సనత్నగర్లో ఓ పుట్టిన రోజు పార్టీలో డ్రగ్స్ వినియోగిస్తుండగా ఎస్వోటీ అధికారులు దాడులు చేసి ఐదుగురు యువకులను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. 4 గ్రాముల ఎండీఎంఏ, 5 గ్రాముల గంజాయితో పాటు ఓసీబీ ప్లేవర్స్ డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. గోవా నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు విచారణలో తేలింది. ఎన్డీపీఎస్ యాక్ట్ కింద సనత్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.