తెలంగాణ రాష్ట్రంలోని లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఇల్లందు - ఖమ్మం రహదారిపై లలితాపురం చెక్పోస్టు వద్ద పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా కారులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి నుంచి రూ.1.5 లక్షల నగదును పట్టుకున్నారు. సదరు వ్యక్తి వద్ద నగదుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో.. పట్టుకున్న నగదును సిజ్ చేసి ఇల్లందు పోలీసు స్టేషన్లో అప్పగించినట్లు అధికారులు వెల్లడించారు.