కడప అసెంబ్లీ నియోజకవర్గంలో తొలిసారి పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థి రెడ్డప్పగారి మాధవి రెడ్డి కొన్నాళ్లుగా తన ప్రసంగాలతో వార్తల్లో నిలుస్తున్నారు. ఆమె నామినేషన్ దాఖలు చేసిన తరువాత ఆమె ఆస్తుల వివరాలూ చర్చనీయమవుతున్నాయి. తన పేరిట రూ. 5.4 కోట్ల విలువైన 6,438 గ్రాములు అంటే 6 కేజీల 438 గ్రాముల బంగారం ఉన్నట్లు ఆమె అఫిడవిట్ లో వెల్లడించారు. డైమండ్ ఆర్నమెట్స్ కూడా అఫిడవిట్లో బాగానే చూపించారు.