మణిపూర్లో పట్టపగలే దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. సాయుధులైన ఐదుగురు వ్యక్తులు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) బ్రాంచ్లో రూ.20 లక్షలు లూఠీ చేశారు. దీంతో సీసీటీవీ ఫుటేజ్ ద్వారా నిందితులను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. గురువారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో చురచంద్పూర్ జిల్లాలోని కే సాల్బంగ్ ఎస్బీఐ బ్రాంచ్లోకి ఐదుగురు వ్యక్తులు చొరబడి ఆయుధాలతో బ్యాంకు సిబ్బందిని బెదిరించి సుమారు రూ.20 లక్షలు దోచుకున్నారు.