పట్టపగలే బ్యాంకు దోపిడీ

63చూసినవారు
పట్టపగలే బ్యాంకు దోపిడీ
మణిపూర్‌లో పట్టపగలే దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. సాయుధులైన ఐదుగురు వ్యక్తులు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) బ్రాంచ్‌లో రూ.20 లక్షలు లూఠీ చేశారు. దీంతో సీసీటీవీ ఫుటేజ్‌ ద్వారా నిందితులను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. గురువారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో చురచంద్‌పూర్ జిల్లాలోని కే సాల్‌బంగ్‌ ఎస్‌బీఐ బ్రాంచ్‌లోకి ఐదుగురు వ్యక్తులు చొరబడి ఆయుధాలతో బ్యాంకు సిబ్బందిని బెదిరించి సుమారు రూ.20 లక్షలు దోచుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్