గుజరాత్లో శుక్రవారం భూకంపం సంభవించింది. షాపర్-వెరావల్-లోత్కా డివిజన్లో భూమి పలుమార్లు కంపించింది. భూకంపం ధాటికి వావాడిలో బహుళ అంతస్తుల భవనాల కిటికీలు, తలుపులు ఊగిపోయాయి. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 2.9గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. రాజ్కోట్కు ఆగ్నేయాన 16 కిలోమీటర్ల దూరంలో భూకంపం వచ్చింది. ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు. ప్రాణ, ఆస్తి నష్టం సంభవించినట్లు సమాచారం లేదు.